6:09 AM

ఫెంగ్ ష్యూతో కాలగమనంలో మార్పులు

మానవుని జీవన గమనాన్ని ప్రకృతిలోని వివిధ అంశాలతో మిళితం చేస్తూ భవిష్యత్తును దేదీప్యమానంగా వెలుగు చూపేందుకు రూపోందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. మూడువేల సంవత్సరాల కిందట ఈ శాస్త్రం ఫ.సి పేరుతో చైనాలో వెలుగు చూసింది. తదనంతరం ఫెంగ్ ష్యూగా రూపాంతరం చెంది వాస్తు, అలంకరణ, జీవన విధానాలపై పెను మార్పులు తీసుకు వచ్చింది.ఫెంగ్ ష్యూ శాస్త్రం మానవుడి నిత్య జీవితానికి సూచించబడిన అంశాలు చాలావున్నాయి. ఈ శాస్త్రం ప్రకారం జీవితంలోని కీలక అంశాల్లో శక్తిని అంధించగలవని ప్రధానంగా చెపుతుంటారు. అలాగే వాస్తురీత్య ఎనిమిది మూలల్లో ఏ మూల ఎలా శుభం జరుగుతుందో ఇలా వివరించారు.

1. ఆగ్నేయం... సంపద, వృద్ది, చెక్క, ఆకుపచ్చరంగు.
2. దక్షిణం.... పేరు, ప్రతిష్టలు, అగ్ని, ఎరుపు రంగు.
3. నైరుతి... ప్రేమ, సంసారం, భూమి, పసుపు, మట్టి రంగు.
4. తూర్పు... ఆరోగ్యం, కుటుంబం, చెక్క, ఆకుపచ్చ రంగు.
5. పడమర... భావుకత, సంతానం, లోహం, తెలుపు, బూడిదరంగు, మెటాలిక్ రంగు.
6. ఈశాన్యం... జ్ఞానం, విద్య, భూమి, పసుపు, మట్టి రంగు.
7. ఉత్తరం... వృత్తి, నీరు, నీలం, నలుపు రంగు.
8. వాయవ్యం... యానం, పరోపకారం, లోహం, తెలుపు, బూడిద రంగు, మెటాలిక్ రంగు.

0 comments:

Post a Comment