ఒంటరిగా వెళుతున్న జీవితంలోకి
అనుకోకుండా నువ్వొచ్చావు
అన్నీ తెలుసనుకునే నాకు
అనుభూతులెన్నో చూపించావు
ఎదురుచూపంటె తెలియని నాకు
ఎన్ని జన్మలయినా ఎదురుచూసేలా చేశావు
సృష్టి నిండా స్నేహం ప్రేమ రెండే గొప్పవనుకున్నాను
వీటికన్నా గొప్పది మన అనుబంధం అని తెలుసుకున్నాను
ఇద్దరు మనుషులు కలసి ఉంటేనే బంధం అనుకున్నాను
మనస్సులు కలిస్తే కూడా బంధమవుతుందని తెలుసుకున్నా
దూరంలో ఉన్నావని బాధలో ఉన్నా
నా వెంటే ఉన్నావన్న ఆశతో బ్రతుకుతున్నా ...
This will never happen in your life again!
జ్యోతిష్యుల లెక్కల ప్రకారం శుక్రవారంనాడు ఓ విచిత్రం జరుగనుంది. ఒకేసారి తొమ్మిది సంఖ్యలు కలుస్తున్నాయి. అది 07-08-09 అంకెలతో కలిసి 01 నుంచి 09 అంకెల్లోకి మారిపోతుంది. ఇలా వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.ఈ యోగం ఈసారి 7 ఆగస్టుతో రానుంది. 07 తారీఖు, 08వ నెల మరియు 09వ సంవత్సరం, ఈ అంకెలు మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల 56 సెకండ్లకు కలుస్తాయి. ఆ సమయంలో ఈ అంకెలు 01 నుంచి 09గా వరుసక్రమంలో మారుతాయి. ఈ క్షణాలు చాలా దుర్భరమైనవని సంఖ్యాశాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.
రాజయోగం పరిస్థితి :- క్రమసంఖ్య 7 చాల గొప్పదని భాగవత పండితులు పండిట్. ఉమేశ్ భాయీ జానీ చెపుతున్నారు. 1 నుంచి 9 వరకున్న సంఖ్యలను కలిపితే 45 వస్తుంది. వీటిని కలిపితే 9 అవుతుంది. మన శరీరంకూడా 9 ద్వారాలు కలిగినది. ఈ రోజు ఉదయం గం. 8.28లనుంచి సాయంత్రం గం.4.24ల వరకు రాజయోగం బ్రహ్మాండంగా ఉంది. ఈ సమయంలో చేసిన శుభకరమైన పనులకు ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన సూచిస్తున్నారు.
శుభకార్యాలకు మహోన్నతమైనది :- 1 నుంచి 9 వరకుగల సంఖ్యల్లో నవగ్రహాలుంటాయంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్రజ్ఞులు సంజయ్ దుల్హానీ. సంఖ్యాశాస్త్రానన్నుసరించి ఇలాంటి సమయం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఆయన తెలిపారు.
ఇలాంటి సమయంలో శుభకార్యాలు చేస్తే ఉత్తమమైన ఫలితాలుంటాయని ఆయన పేర్కొన్నారు. 9 సంఖ్యతో ఏ సంఖ్యను కలిపినా మూల్యాంకం అదే వస్తుంది. ఈ స్థితి కృష్ణపక్షంలో తిథి విదియ, తులా లగ్నం మరియు లగ్నోదయం స్వాతి నక్షత్రంలో ఈ కాలం వస్తుంది.
** ముఖ్యంగా 2, 3, 8 సంఖ్యాకులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్యులు.
** ఈ రోజు యాత్రలకు శుభసమయం
** దుర్ఘటనలనుండి జాగ్రత్తగా ఉండండి** ధనహాని కలిగే సూచనలున్నాయి, మాటలు ఆచితూచి మాట్లాడండి.
** నూతన కార్యాలను ప్రారంభించేవారికి మంచి ఫలితాలుంటాయి
** ఎవ్వరినీ విశ్వసించకండి
** నూతన కార్యాలను ప్రారంభించండి, ధనలాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్దేవ్ సోలంకి-I నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.
శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్దేవ్ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది.మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతంలోని ప్రధానమైన విషయాలనుకూడా చెక్కారు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి. మానవుని జీవన గమనాన్ని ప్రకృతిలోని వివిధ అంశాలతో మిళితం చేస్తూ భవిష్యత్తును దేదీప్యమానంగా వెలుగు చూపేందుకు రూపోందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. మూడువేల సంవత్సరాల కిందట ఈ శాస్త్రం ఫ.సి పేరుతో చైనాలో వెలుగు చూసింది. తదనంతరం ఫెంగ్ ష్యూగా రూపాంతరం చెంది వాస్తు, అలంకరణ, జీవన విధానాలపై పెను మార్పులు తీసుకు వచ్చింది.ఫెంగ్ ష్యూ శాస్త్రం మానవుడి నిత్య జీవితానికి సూచించబడిన అంశాలు చాలావున్నాయి. ఈ శాస్త్రం ప్రకారం జీవితంలోని కీలక అంశాల్లో శక్తిని అంధించగలవని ప్రధానంగా చెపుతుంటారు. అలాగే వాస్తురీత్య ఎనిమిది మూలల్లో ఏ మూల ఎలా శుభం జరుగుతుందో ఇలా వివరించారు.
1. ఆగ్నేయం... సంపద, వృద్ది, చెక్క, ఆకుపచ్చరంగు.
2. దక్షిణం.... పేరు, ప్రతిష్టలు, అగ్ని, ఎరుపు రంగు.
3. నైరుతి... ప్రేమ, సంసారం, భూమి, పసుపు, మట్టి రంగు.
4. తూర్పు... ఆరోగ్యం, కుటుంబం, చెక్క, ఆకుపచ్చ రంగు.
5. పడమర... భావుకత, సంతానం, లోహం, తెలుపు, బూడిదరంగు, మెటాలిక్ రంగు.
6. ఈశాన్యం... జ్ఞానం, విద్య, భూమి, పసుపు, మట్టి రంగు.
7. ఉత్తరం... వృత్తి, నీరు, నీలం, నలుపు రంగు.
8. వాయవ్యం... యానం, పరోపకారం, లోహం, తెలుపు, బూడిద రంగు, మెటాలిక్ రంగు.










































